సొసైటీ సేవలు ప్రశంసనీయం
Published: Wednesday October 13, 2021
పాలేరు అక్టోబర్ 12 ప్రజాపాలన( ప్రతినిధి) : నేలకొండపల్లి డెవలప్మెంట్ వేల్ఫేర్ ట్రస్టు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నేలకొండపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రాయపూడి నవీన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ట్రస్టు, మరియు శరత్ మ్యాక్స్ విజన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల కేంద్రం ను నిర్వహించారు. 120 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిభిరం ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఉచిత వైద్య శిభిరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ట్రస్టు వారు నిర్వహించే ఉచిత వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు ఓరుగంటి నారాయణరావు, కార్యదర్శి కడియాల నగేష్, మ్యాక్స్ విజన్ ప్రతినిధులు విక్రమ్, లిఖిత, నివిన్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: