విద్యార్థులకు సేవా కార్యక్రమాలు అభినందనీయం.. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు..

Published: Thursday October 20, 2022

 

 తల్లాడ, అక్టోబర్ 19 (ప్రజా పాలన న్యూస్): ప్రభుత్వ పాఠశాలకు అధికంగా పేద విద్యార్థులే వస్తారని, వారికి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాలలో గ్రామానికి చెందిన దొబ్బల శ్రీనివాసరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 25వేల విలువ చేసే వంటగదిని నిర్మించారు. ఈ గదిని ప్రారంభించిన ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని జన్మభూమికి సేవచేసిన శ్రీనివాసరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, పులబాల వెంకటేశ్వర్లు, హెచ్ఎం సరోజిని, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు, హనుమంతరావు, పాల్గొన్నారు. తల్లాడ, అక్టోబర్ 19 (ప్రజా పాలన న్యూస్): ప్రభుత్వ పాఠశాలకు అధికంగా పేద విద్యార్థులే వస్తారని, వారికి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాలలో గ్రామానికి చెందిన దొబ్బల శ్రీనివాసరావు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 25వేల విలువ చేసే వంటగదిని నిర్మించారు. ఈ గదిని ప్రారంభించిన ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని జన్మభూమికి సేవచేసిన శ్రీనివాసరావును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ అధ్యక్షులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, పులబాల వెంకటేశ్వర్లు, హెచ్ఎం సరోజిని, ఉపాధ్యాయులు మాదినేని నరసింహారావు, హనుమంతరావు, పాల్గొన్నారు.