**జాతీయ సమాచార హక్కు పరిరక్షణ సమితి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా గుర్రం ప్రదీప్ కుమ
Published: Friday February 03, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 02, ప్రజాపాలన : జాతీయ సమాచార హక్కు పరి రక్షణ సమితి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా జాతీయ సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు ఆదేశానుసారం కన్నెబోయిన ఉషారాణి రాష్ట్ర కోఆర్డినేటర్ జారీ చేసిన నియామక పత్రాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు న్యాయవాది గోళీ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా గుర్రం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యత నాకు అప్పగించి నందుకు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పాలుపంచుకునే విధంగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని సంస్థకు ఎలాంటి అవరోధాలు కలగకుండా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ముందుకు కొనసాగిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గాదం ఉత్తరయ్య ముదిరాజ్, జాతీయ కోఆర్డినేటర్ రాష్ట్ర కన్వీనర్ బండ మీది అంజయ్య రాష్ట్ర కోఆర్డినేటర్ కన్నేబోయిన ఉషారాణి కి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి శ్రీనివాస్, సబ్బని రాజనర్సు తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: