బిఆర్ఎస్ పార్టీ వల్లే దేశ రాజకీయాల్లో కీలక మార్పు ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్

Published: Saturday January 21, 2023
జన్నారం, జనవరి 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పలువురు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ ఆధ్వర్యంలో వారిని కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ వల్లే రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొని రాబోతుందని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా లేని అనేక సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేసి చూపిందని ఇక టిఆర్ఎస్ పార్టీ గా పేరు మార్చుకొని దేశ ప్రజలకు జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేశ రాజకీయాల్లో కీలక మార్పు పోస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, ఎ ఏం సి చైర్మన్ శ్రీపతి పద్మ, వైస్ చైర్మన్ గొట్ల రాజేష్ యాదవ్, మంచిర్యాల జిల్లా నాయకులు భరత్ కుమార్, ముత్యం సతీష్, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేష్  ఉపసర్పంచ్ శ్రీనివాస గౌడ్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.