కోహెడ జిల్లా పరిషత్ పాఠశాల నూతన కమిటీ ఎన్నిక ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.శివకుమార్

Published: Friday December 03, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి : గురువారం రోజు  కోహెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఏఐఎస్ఎఫ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి, అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పి.శివకుమార్ మాట్లాడుతూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు స్వచ్చందంగా సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం  కోసం AISF నిరంతరం పోరాటాలు చేస్తుందని వారు విద్యార్థులకు తెలియచేసారు. అంతేకాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాలు సరియైన మెనూ ప్రకారం లేవని, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండటం లేవని, అంతేకాకుండా పాఠశాల పరిసరాలను శుభ్రం చేయడానికి స్వీపర్లు రావడం లేదని విద్యార్థులు తెలియచేశారని అన్నారు. ప్రభుత్వం నుండి పాఠశాల అభివృద్ధికి సరియైన నిధులు రాకపోవడం వలన విద్యార్థులకు సరిపడా బెంచిలు, శానిటేషన్ పరికరాలు లేవని, దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నూతన కమిటీ : అధ్యక్షుడు ఎస్. సాయికుమార్, డి.సాయి కిరణ్ (సెక్రెటరీ), ఉపాధ్యక్షుడు వి.వినయ్, గర్ల్స్ కన్వీనర్ గా శ్రావణి, శ్రీజ, దీవెన, గీత మరియు 15 మందితో నూతన కమిటి ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు పల్లపు శివకుమార్, కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు.