ప్రాణత్యాగం చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ

Published: Thursday June 24, 2021
బాలపూర్, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రాణ త్యాగం చేసిన మహనీయుడుని మీర్ పేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు పెండ్యాల నర్సింహ్మ ఆధ్వర్యంలో దేశ సమగ్రత దేశ రక్షణకు ఏక్ దేశ్ మే దో జెండా దో ప్రధాని నైరంగా అనే నినాదంతో దేశ సమైక్యత కోసం ప్రాణ త్యాగం చేసిన వారుని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు  మాట్లాడుతూ... శ్యాం ప్రసాద్ ముఖర్జీకి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ ప్రజల కోసం అతని ప్రాణాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, జిల్లా బిజెపి కార్యదర్శి అనిత నాయక్, జిల్లా సీనియర్ నాయకులు యాదగిరి యాదవ్, నాగరాజు బుచ్చి రాములు, నరసింహ్మ యాదవ్, ఓ బి సి మోర్చా అధ్యక్షులు రమేష్ ముదిరాజ్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.