మంత్రి హరీష్ రావుకు వినతి పత్రం అందజేత
Published: Friday January 06, 2023
ఇబ్రహీంపట్నం, జనవరి 05 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వేములకుర్తి గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఉంది కానీ అందులో ఎంబిబిఎస్ డాక్టర్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సుమారుగా 6000 జనాభాతో కూడిన గ్రామంలో డాక్టర్ అందుబాటు లేక రోగాలు వచ్చినప్పుడు ప్రజల పట్టణానికి వెళ్లి ఆర్థిక స్థోమత లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు వెంటనే ఎంబిబిఎస్ డాక్టర్ ని నియమించాలని మంత్రి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పెంట లింబాద్రి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Share this on your social network: