తేమశాతాన్ని పరిశీలించిన చైర్మన్ నరసింహారావు..

Published: Tuesday December 14, 2021
తల్లాడ, డిసెంబర్ 13 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కలకొడిమ సహకార సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ దిరిశాల నరసింహారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈఓ గీతాశ్రీ ద్వారా వడ్ల తేమశాతాన్ని పరిశీలించారు. అనంతరం చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ రైతులు తేమశాతాన్ని తక్కువగా ఉన్నవాటిని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా మట్టిపెళ్లలు, దుమ్ము లేకుండా తీసుకొస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కలకోడిమ సొసైటీ సీఈఓ రామ్ కీ రాజు, రైతులు ఉన్నారు.