కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకుడు మృతి.

Published: Wednesday February 02, 2022
మధిర ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకునిగా గత 12 సంవత్సరాలుగా పని చేసిన శ్రీమాన్ ముండుంబా సంపత్ కుమార్ ఆచార్యులు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అర్చకుని స్వగ్రామం ఖమ్మం సమీపన ఉన్న చిమ్మపడి గ్రామంలో పార్దివాదేహం ఉంచినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలోని పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు వారి మృతికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.