18,19, న ఇంటర్మీడియట్ పరీక్ష సామాగ్రి పంపిణీ : డిఐఈఓ శ్రీధర్ సుమన్

Published: Tuesday October 19, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 18 (ప్రజాపాలన) : జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలకు 18 19 తేదీలలో పరీక్ష సామాగ్రి ని పంపిణీ చేస్తున్నట్లు జిల్లా మాధ్యమిక విద్యాధికారి ఈఐఈఓ శ్రీధర్ సుమన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 పరీక్షా కేంద్రాలకు గానూ సమాధాన పత్రాలు, ఓ ఎం ఆర్ కార్డులు, తదితర సామాగ్రి జిల్లా కేంద్రానికి చేరుతుందని, ఆయా సామాగ్రిని ప్రిన్సిపాల్ లు, సోమ, మంగళ వారాలలో, తీసుకెళ్లాలని అన్నారు. ఈ నెల 25 వ తేదీ నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారని, జనరల్ విద్యార్థులు 4326 మరియు 882 ఒకేషనల్ మొత్తం 5208 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని అన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లు, నామినల్ రోళ్లు, ఫోటో హాజరు సీట్లు, డి తాళాలను కళాశాల లాగిన్ ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. విద్యార్థులు సైతం బోర్డు సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్  చేసుకోవచ్చని సూచించారు. పరీక్ష నిర్వాహకులను 20వ తేదీన శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.