మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎండి దాన కిషోర్ కు వినతి

Published: Tuesday December 06, 2022
మేడిపల్లి, డిసెంబర్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో సివరేజి లైన్ మరియు భరత్ నగర్, సత్య నగర్, సాబేర కాలనీలలో మంచినీటి పైప్ లైన్ వేసి ప్రజలకు మంచినీళ్ల సమస్యను తీర్చాలని కోరుతూ స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు జలమండలి ఎండి దాన కిషోర్ కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన దాన కిషోర్   సంబంధిత అధికారులకు తెలియజేశారని కార్పొరేటర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకటరావు పాల్గొన్నారు.