కేసీఆర్, రసమయి చిత్రపటాలకు క్షీరాభిషేకం. తిమ్మాపూర్ (శంకరపట్నం)మార్చి11 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Monday March 13, 2023
మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజా సంక్షేమానికి 200 కోట్ల నిధులు మంజూరైన సంధర్బంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మానకొండూర్ నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్రూం ఇళ్లకు గాను రూ.90 కోట్లు, దళిత బంధు యూనిట్ కు రూ. 110 కోట్లను మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేసారు. ఈ సంధర్బంగా నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటీసీలు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: