వైకుంఠధామం ప్రారంభం

Published: Thursday October 29, 2020
మధిరఖమ్మంపాడు లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, డంపింగ్ యార్డును జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా కమల రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను, గుర్తించి,అవి పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో   ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, అంతర్గత సిసి రహదారులు, నిర్మించటం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, వైస్ ఎంపీపీ సామినేని సురేష్, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ దొండపాటి రుక్మిణమ్మ,   పాల్గొన్నారు.