వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు మంచిర్యాల బ్యూరో, జనవరి11, ప్రజాపాలన:

Published: Friday January 13, 2023
 సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల వాసవి క్లబ్, వనితా క్లబ్, కపుల్స్ క్లబ్ , యూత్ క్లబ్బులు  సంయుక్తంగా గురువారం స్థానిక వైశ్య భవన్ లో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు ముక్త శ్రీనివాస్ మాట్లాడుతూ, అనేక సేవా కార్యక్రమాలలో ముందుగా ఉంటున్న వాసవి క్లబ్స్ సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయాన్ని అందరికీ తెలిసే విధంగా ఆడపడుచులకు రంగవల్లి పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం అభినందనీయమన్నారు. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మహిళా మణులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు, అలాగే పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీలలో జిల్లా గవర్నర్ కొండ చంద్రశేఖర్, కార్యదర్శి అప్పాల శ్రీధర్ , అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పుల్లూరి బాలమోహన్, జిల్లా అధికారులు వుత్తూరు రమేష్, చిలువేరు శ్రీనివాస్ , చొక్కారపు శ్రీనివాస్, నాగిశెట్టి జ్యోతి, పాత సాయి సూరజ్ , రీజియన్ సెక్రటరీలు కాచం సతీష్ , సిద్ధంశెట్టి మధు శ్రీ , జోన్ చైర్మన్లు కేశెట్టి వంశీకృష్ణ, గౌరిశెట్టి ధనలక్ష్మి ,వాసవి క్లబ్ అధ్యక్షులు నలమాసు ప్రవీణ్, కార్యదర్శి ఎర్రం వెంకటేష్ , కోశాధికారి చిలువేరు మహేష్ , వనితా క్లబ్ అధ్యక్షురాలు మోటూరి సరిత , కార్యదర్శి రేణిగుంట్ల స్వప్న,  కోశాధికారి బోనగిరి లావణ్య,  కపుల్స్ క్లబ్ అధ్యక్షులు అయిత స్వప్న శ్రీనివాస్, కార్యదర్శి చిట్టిమల్ల సౌజన్య శ్రీనివాస్, కోశాధికారి కొడిత్యాల శశిరేఖ వెంకట వరప్రసాద్ , యూత్ క్లబ్ అధ్యక్షులు తాటిపల్లి సాయి వర్ధన్, కార్యదర్శి కేశ సాయి శరత్ , కోశాధికారి సంక శివ హేమంతులతోపాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.