కార్పొరేట్లకు లాభాలు.. పేదల పై భారాలా
Published: Friday February 19, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల:18 ఫిబ్రవరి (ప్రజా పాలన): ములకలపల్లి మండలం కేంద్రం పరిధిలోగల మాదారం గ్రామంలో జెడ్పిటిసి సున్నం నాగమణి నివాస గృహం దగ్గర సమావేశం నిర్వహించన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని. వెంటనే ధరలు తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి అంజుమ్, ఓ బి సి అధ్యక్షుడు పుష్పాల హనుమంత్ రావు, కణితి సత్యనారాయణ, తాళ్ల చంటి, కన్నా చార, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: