ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజు గుప్తా ఎన్నిక

Published: Friday September 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 సెప్టెంబర్ ప్రజాపాలన : పార్టీ అధిష్ఠానం ఆదేశాలను వమ్ముచేయకుండా తుచ తప్పకుండా పాటిస్తే పార్టీ పరంగా తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. అధినాయకత్వం ఆదేశాలే శిరోధార్యంగా భావించి కార్యకర్తలను సమన్వయంతో చైతన్యం చేయాలి. పార్టీ పరంగా జరిపే సమావేశాలను విజయవంతం చేయడానికి తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలి. అందరితో కలుపుగోలు తనం, ఓపికతో పనిచేయడం, అందరిలో ఒకనిగా మసలుకునేవానికి అందరి ఆదరాభిమానాలు లభిస్తాయి. కృషితో నాస్తి దుర్భిక్షం ఆర్యోక్తిననుసరించి కష్టపడి పనిచేసిన వ్యక్తికి గుర్తింపు లభిస్తుందనడానికి ఉదాహరణ రాజుగుప్తా. ధారూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గా రాజుగుప్తా నిర్వహించిన విధులే నేడు ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి లభించడం విశేషం. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రోత్సాహం మరువలేనివని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.