టీజేయస్ ఆత్మగౌరవ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Published: Monday June 06, 2022

ఇబ్రహీంపట్నం, జూన్ 05 (ప్రజాపాలన ప్రతినిధి):
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనుకుంటే, అన్నిరంగాల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తెలంగాణ జనసమితి రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద ప్రో: కోదండరాం సార్ తలపెట్టనున్న ఆత్మగౌరవ దీక్షకి సంబంధించిన పోస్టర్ మరియు కరపత్రాన్ని ఈ సందర్బంగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆంధ్ర కార్పొరేట్ శక్తులతో ఏకమైన కేసీఆర్ నిరంకుశ పాలనను ఎదిరించడానికి కోరుట్ల నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రేపటి ఆత్మగౌరవ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, మెట్ పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం పట్టణ అధ్యక్షులు పసునూరి శ్రీనివాస్, శనిగారపు అశోక్, కంతి రమేష్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు జిల్లాపెల్లి దిలీప్, యువజన సమితి నియోజకవర్గ అధ్యక్షుడు వన్నెల శశి, నాయకులు కంతి లింగారెడ్డి, నాచుపల్లి తిరుపతి, నీరటి రాఘవేంద్ర, కనక శ్రీకాంత్, అల్లాడి మనిదీప్, కంతి అర్జున్, మ్యాన సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.