విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలి: సర్పంచ్ మర్రి తిరుపతిరావు
Published: Monday February 27, 2023
బోనకల్ , ఫిబ్రవరి 26 ప్రజాపాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు కేవీఎం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల పేరెంట్స్ మీటింగ్ ను పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పదో తరగతి ఉత్తీర్ణ సాధించేందుకు తగిన బాధ్యత తీసుకొని సరైన ఆహార నియమాల పాటించి వారిని ప్రోత్సహించి కురాకుల వెంకయ్య ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రమేష్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Share this on your social network: