తాడికల్ లో ముగిసిన కంటి వెలుగు శిబిరం

Published: Tuesday March 07, 2023
శంకరపట్నం మార్చి 06 ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో రైతు వేదిక కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం సోమవారం తాడికల్ గ్రామంలో ముగించుకొని మంగళవారం చింతకుంట గ్రామంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు డా. సంధ్యారాణి తెలియజేశారు. ఈ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తాడికల గ్రామంలో 13 పని దినాలలో 2000 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి 347 మందికి కంటి అద్దాలు అందజేసినట్టు 522 మందికి ప్రత్యేక కళ్లద్దాలను ఆర్డర్ చేసి అందించనున్నట్లు డాక్టర్ తెలియజేశారు. ఈ శిబిరంలో ఏఎన్ఎంలు సరస్వతి, వినోద సహాయ సిబ్బంది కె.సర్వోత్తమ్,  ఆప్తమాలజిస్ట్ కె.రుచిత, డీఈఓ వెంకట సాయి, ఆశా కార్యకర్తలు స్వయంప్రభ, స్వప్న, రాధా, లావణ్య, లక్ష్మిలు ఈ కంటి వెలుగు శిబిరంలో విధులు నిర్వహిస్తు, కంటి పరీక్ష కోసం వచ్చే గ్రామస్తులకు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు.