గ్రామపంచాయతీ నిధుల మంజూరు పై హర్ష వ్యక్తం చేసిన సర్పంచ్ దంపతులు

Published: Monday March 06, 2023
మధిర మార్చి 5 ప్రజా పాలన ప్రతినిధి:గ్రామపంచాయతీల అభివృద్ధి కొరకు 10 లక్షలు విడుదల చేస్తూ జారీ అయిన జీవోపై సర్పంచ్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. 
నిధులు మంజూరు కోసం కృషిచేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు ,జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజుకి కృతజ్ఞతలు తెలిపిన నక్కలగరువు సర్పంచ్...మునగ వెంకట్రావమ్మవీరబాబు
గ్రామపంచాయతీలు అభివృద్ధి కోసం ప్రతి పంచాయతీకి పది లక్షల రూపాయలు జీవో విడుదల కావడం పట్ల నక్కలగరుబు గ్రామ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మవీరబాబు హర్షం వ్యక్తం చేశారు.