శ్రీ చైతన్య స్కూల్లో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా

Published: Thursday September 01, 2022
నిర్వహించారు మధిర ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుస్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు  వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగానిర్వహించబడ్డాయి.
ఇందులో భాగంగా ప్రైమరీ విద్యార్థులు గణపతి ఆవిర్భావాన్ని నాటక రూపం లో ప్రదర్శించారు.దేవిశెట్టి. సాయి మణికంఠ శివుని పాత్ర అద్భుతంగా ప్రదర్శించాడు.   అమర.  చాతుర్య పార్వతి పాత్రను పోషించగా, బాల గణపతిగా బొల్లు. మోక్షిత్ కుమార్,కుమార స్వామి గా  చలువాది. యోజిత్  నటించారు.పాఠశాల ప్రిన్సిపాల్ అందరకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసారు.డీన్. ఎస్ . రమేష్, సి బ్యాచ్ ఇంచార్జి జి. నరేష్ మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాఠశాల చైర్మన్ శ్రీ. మల్లెంపాటి. శ్రీధర్, మరియు. డైరెక్ట్రెస్ శ్రీమతి. మల్లెంపాటి. శ్రీవిద్య  విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియచేసారు.