చర్చి నిర్మాణానికి సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి 10వేలు విరాళం.. తల్లాడ, మార్చి 10 (ప్రజాపాలన న్

Published: Saturday March 11, 2023

 మండల పరిధిలోని  కుర్నవల్లి లో నూతనంగా నిర్మించనున్న చర్చి నిర్మాణానికి కుర్నవల్లి సొసైటీ చైర్మన్   అయిలూరి ప్రదీప్ రెడ్డి పదివేల  రూపాయలను  వితరణగా చర్చి ఫాదర్ కిరణ్ కు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిరణ్ మాట్లాడుతూ   నూతన చర్చి నిర్మాణానికి పదివేల రూపాయలు అందజేసిన  ఆయిలూరి ప్రదీప్ రెడ్డిని ఆయన అభినందించారు,  ఇతరులకు సహాయం చేయడం , ప్రేమ, జాలి కలిగియున్న వారికి దేవుని కృప ఉంటుందన్నారు, చర్చి నిర్మాణానికి దాతల ముందుకు వచ్చి సహకరించాలని కోరారు అనంతరం ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది అన్నారు అందులో భాగంగానే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సూచన మేరకు అభివృద్ధి  కార్యక్రమాలకు ముందుంటున్నామన్నారు. కార్యక్రమంలో చర్చి పెద్దలు  ఆదూరి  బుచ్చాలు, ఎక్కిరాల రవి, కొత్తపల్లి శ్రీనివాసరావు, రవి తదితరులు పాల్గొన్నారు