మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ
Published: Saturday May 28, 2022
కోరుట్ల, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి):
మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ గ్రామంలో ప్రాధమిక పాఠశాల లో జరిగే మౌలిక వసతుల అభివృద్ధి పనులకు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల జెడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు, ఆర్ డి ఓ, మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో చైర్మన్లు పార్టీ నాయకులు, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: