విద్యార్థి దశ నుంచే ఆటలపై దృష్టి సారించాలి
Published: Monday January 09, 2023
* పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 08 జనవరి ప్రజాపాలన : విద్యార్థి దశ నుంచే ఆటలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మినీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో క్రయాన్స్ పాఠశాల విద్యార్థులు మ్యాచ్ ఆడగా వారికి ప్రోత్సాహంగా షీల్డ్ అందించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీపీ కరణం అరవింద్ రావు, దోమ జెడ్పీటీసీ కే నాగి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్, సుల్తాన్ పూర్ ఎంపీటీసీ వెంకట్ రాంరెడ్డి, పరిగి మున్సిపల్ కౌన్సిలర్ మీర్ తాహీర్ అలీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: