సబ్సిడీ పైన పెరటి కోళ్ల పంపిణీ.

Published: Thursday January 19, 2023

జన్నారం, జనవరి 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  జన్నారం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం నుండి 75% సబ్సిడీ పైన మొదటి విడత లో భాగంగా 15 మంది లబ్ధదారులకు ఒక్కొక్కరికి 25 కోడి పిల్లల చొప్పున అందించడం జరిగిందని బుధవారం జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నుండి 25 రూపాయలకి ఒక్క కోడి పిల్ల  చొప్పున 25 కోడి పిల్లలు ఒక్క బెనిఫెషరీకి 600 రూపాయలు ముందస్తు డీడీ చెల్లించాలని అయినా తెలిపారు. 75% సబ్సిడీ పైన అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండవ విడత గా మరొక వారం రోజుల్లో మిగతా 15 మంది లబ్ధిదారులకు యూనిట్స్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి శ్రీకాంత్, ఏఎంసి వైస్ చైర్మన్ గోట్ల రాజేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, పశు వైద్య సిబ్బంది డా, కిరణ్, తపాల్పుర్ సిబ్బంది, శిరీష, సాగర్, తదితరులు పాల్గొన్నారు.