మోహన్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ్

Published: Tuesday July 12, 2022
బోనకల్, జూలై 12 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని
రావినూతల గ్రామ తూర్పు తండాకు చెందిన అజ్మీరా మోహన్(55) తన కుమారుడు అజ్మీర లింగా తో కలిసి కొన్ని రోజుల క్రితం  బ్రతుకు తెరువు కోసం పూల మొక్కల వ్యాపారం నిమిత్తం సూర్యాపేటకు వెళ్ళినారు. అకస్మాత్తుగా సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు గుండెపోటు వచ్చి సూర్యాపేట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుచుండగా మరణించినాడు. మృతుడికి భార్య, కుమారుడు ,కుమార్తె ఉన్నారు. మోహన్ మరణ వార్త విన్న తూర్పు తండా వాసులు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహానికి గ్రామ సర్పంచ్ కమ్మినేని ఉపేందర్ పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ సర్పంచ్ కొమినేని ఉపేందర్, ఉప సర్పంచ్ బోయిన్పల్లి కొండలు, షేక్ జానీ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, టిఆర్ఎస్ నాయకులు తుడుం మంగయ్య, ఎరగాని నాగభూషణ్, అజ్మీరా సూక్య, దుద్దుకూరి మోహన్రావు, గమ్మిడి నరసింహారావు, షేక్ అమృద్దీన్ ,భూక్యా లక్య, తూర్పు తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.