ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో దోసపాటి విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు.

Published: Monday April 11, 2022
మధిర ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో ఆదివారం నాడు సాయి బాలాజీ ఫైర్ వర్క్ అధినేత దోసపాటి విజయ్ కుమార్. సాయి బాలాజీ ఫైర్ వర్క్స్ మరియు ప్రజా జ్యోతి రూరల్ రిపోర్టర్.  పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు మతిస్థిమితం లేని వారికి ఆర్కే ఫౌండేషన్ వారు ఎంతో కష్టపడి వారిని కంటికి రెప్పలా కాపాడుతూ. కనీసం ఆఖరి సమయంలోనైనా వారికి కొంత ఆనందాన్ని ఇవ్వడం. చాలా గొప్ప విషయం అంటూ కొనియాడారు అనంతరం వారితో కలిసి భోజనశాలలు గడపటం శ్రీ రామ నవమి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పలువురికి ఆదర్శంగా నిలిచిన దోసపాటి విజయ్ కార్యక్రమంలో ఆర్కె ఫౌండేషన్ రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్ కె రామారావు పాల్గొన్నారు.