షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం యూత్ వింగ్ వారు బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు

Published: Tuesday April 06, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన : బాబు జగ్జీవన్ రావు 113 వ జయంతి పురస్కరించుకొని  ప్రతి ఒక్కరిని  సమన్వయ పరచడంలో సమానత్వంతో చూసే మానవత్వం కలిగి ఉండాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగం మహేష్  ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులు మేయర్ చిగురంత పారిజాత నర్సింహారెడ్డి, ఎస్సీ ఆర్ పి ఎస్ నాయకులు హాజరై బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలవేసి అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నిరుపేద వారికి చల్లటి మజ్జిగ తో పాటు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ చిగురింత పారిజాతమా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.... బాబు  జగ్జీవన్ రావు గారి గొప్పతనాన్ని ప్రజలందరికీ గుర్తుచేస్తూ, అలాగే కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆర్ పి ఎస్ నాయకులు, సిబ్బంది, సంఘం సభ్యులు ఇంద్ర, మహిళా మణులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.