జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ గా జ్యోతి కిరణ్** రాజ్యలక్ష్మి బదిలీ **
Published: Tuesday July 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై18(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాకు నూతన ఎక్సైజ్ సూపరిండెంట్ గా జ్యోతి కిరణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కొమురం భీం జిల్లా సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి అసిస్టెంట్ కమిషనర్ గా వరంగల్ కు బదిలీపై వెళ్లగా ఆమె స్థానంలో నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ గా పనిచేస్తున్న జ్యోతి కిరణ్ బదిలీపై జిల్లాకు వచ్చారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జ్యోతి కిరణ్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం, దేశిదారు, గుడుంబా, లాంటివి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సూపరిండెంట్ ను వైన్ షాపుల యజమానులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు
Share this on your social network: