జనవరి 22 25 సీపీఎం తెలంగాణా రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని

Published: Thursday November 18, 2021

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిది : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగల భాస్కర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ అని అన్నారు. జనవరిలో22,25 వరకు జరిగే సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలకు యాచారం వ్యాపారస్తులు ప్రజలు ఈ మహాసభకు విరాళాలు ఇచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి  మండల కార్యదర్శి ఆల్లంపల్లి నరసింహ, మండల కార్యవర్గ సభ్యులు, అంజయ్య, బ్రహ్మయ్య చందు, జంగయ్య, కమిటీ సభ్యులు జగన్, శ్రీమన్నారాయణ, వినోద్ కుమార్, mj. వినోద్, వెంకటయ్య, లాజర్, జంగయ్య, మల్లేష్, తావు నాయక్, ధర్మన్న గూడెం సర్పంచ్ భాషయ్య,  మాస్కు అరుణ, వివిధ గ్రామాల శాఖా కార్యదర్శులు,కార్యకర్తలు, పాల్గొన్నారు