సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన...అశ్వాపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు.......

Published: Tuesday December 27, 2022

అశ్వాపురం ( ప్రజా పాలన.)
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం పంచాయితీ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో.గోగినపాల్లి సైదులు 20,000/_ రూపాయల విలువ గల సిఎంఆర్ రిలీఫ్ చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సూదిరెడ్డి గోపిరెడ్డి,మండల యువజన విభాగం ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ్,గొల్లగూడెం గ్రామ శాఖ  పార్టీ అధ్యక్షుడు పసుల శివకృష్ణ యాదవ్,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు అండగా టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చారని వాటిలో భాగంగానే కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, రైతుబంధు పేదవారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని అందజేయడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా చెప్పారు.