పరిగి పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేస్తాం

Published: Monday January 30, 2023
* పరిగి పురపాలక సంఘం చైర్మన్ ముకుంద అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 29 జనవరి ప్రజా పాలన : పరిగి పురపాలక సంఘాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయుటకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పరిగి పురపాలక సంఘం చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిగి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయుటకు కృషి చేస్తామని అన్నారు. పరిగి పట్టణంలోని ఆర్ & బి ఆఫీస్ నుండి దాసాంజనేయ హనుమాన్ టెంపుల్ వరకు గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు స్ట్రీట్ లైట్ ఏర్పాటు పనులను పరిశీలించామని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు నూతన హంగులతో విద్యుత్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటుతో రాత్రి వేళలో ఇబ్బందులు ఎదురు కావని వివరించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఎదిరే కృష్ణ మునీర్ బిఅర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్యం యువ నాయకులు దోమ శ్రీశైలం, చందు, ఇస్మాయిల్ ఆయా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.