చెన్నకేశ శివకు నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు

Published: Thursday May 19, 2022
బోనకల్ ,మే 18 ప్రజా పాలన ప్రతినిధి: రైలు ప్రమాదంలో
ఇటీవల మరణించిన ఆళ్ళపాడు బీజేపీ యువ మోర్చా గ్రామ ప్రధాన కార్యదర్శి చెన్నకేశ శివ దశ దిన కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు గేల్లా సత్యనారాయణ వచ్చి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గేల్లా సత్యనారాయణ మాట్లాడుతూ దయచేసి యువకులు ఆలోచించాలని జీవితం చాలా విలువైనది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదని, తల్లిదండ్రులకు పుత్రశోకం మిగలకూడదని రాబోయే రోజులన్నీ యువకులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవి, మండల ప్రధాన కార్యదర్శి గంగుల నాగేశ్వరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సుమన్ బాబు ,యువ మోర్చా మండల అధ్యక్షులు కలసాని పరుశురాం, యువనేత బి పి నాయక్ ,కిసాన్ మోర్చా మండల కార్యదర్శి దొంతబోయిన సురేష్, ఆళ్ళపాడు గ్రామ శాఖ అధ్యక్షుడు దొంతుబోయిన వెంకటరావు, గ్రామ ప్రధాన కార్యదర్శి తమ్మారపు లక్ష్మయ్య, గ్రామ కార్యదర్శి రాంబాబు, గ్రామ యువ మోర్చా అధ్యక్షుడు తమ్మారపు ప్రవీణ్, తెల్లబోయిన కొండలరావు, షేక్ హుస్సేన్ ,ఆదాం తదితరులు పాల్గొన్నారు.