పట్టణ ప్రగతిలో ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Wednesday June 15, 2022
మేడిపల్లి, జూన్14 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ సాయి క్రిష్ణ నగర్ కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్  బండారు శ్రీ వాణి వెంకట్రావుల దృష్టికి  కాలనీలో ప్రభుత్వానికి చెందిన స్థలాన్ని కబ్జా కోరల నుంచి సుమారు 60 గజాల స్థలాన్ని రక్షించాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ వెంటనే అట్టి స్థలంలో జిహెచ్ఎంసి బోర్డు ఏర్పాటు చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్థలంలో జిహెచ్ఎంసి అధికారులతో చర్చించి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమీద, కపుసల్య,లక్ష్మి,సునీత, ఉత్తరమ్మ,బాలకృష్ణ,అల్లాడి నిరంజన్ గౌడ్,సుదర్శన్,నరసింహ, పలువురు కాలనీవాసులు నాయకులు పాల్గొన్నారు