ఇటిక్యాల గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో

Published: Thursday February 03, 2022

రాయికల్, ఫిబ్రవరి 2 (ప్రజాపాలన ప్రతినిధి) : రాయికల్ మండలం లోని ఇటిక్యాల గ్రామంలో గల జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నర్సరీ ని రాయికల్ మండల ప్రజా పరిషత్ అధికారి సందర్శించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, కార్యదర్శి పాల్గొన్నారు.