వైకుంఠధామంలో మౌలిక వసతుల కల్పనకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్

Published: Thursday May 27, 2021

పటాన్ చేరు, ప్రజాపాలన ప్రతినిధి : సమాజహితం కోసం లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పటాన్ చేరు పట్టణంలోని వైకుంఠధామం లో మౌలిక వసతుల ఏర్పాటుకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన చెక్కు ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు, ఉచిత వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందించడంతో పాటు ప్రపంచ శాంతి కోసం లయన్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని కొనియాడారు. క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధి స్వర్ణలతను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, బల్దియా అధికారులు వెంకట రమణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్ శివారెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్వర్ణలత, జనార్ధన్, వెంకటేశ్వర్లు, రమణ, సీనయ్య, తదితరులు పాల్గొన్నారు.