హైదరాబాద్ 6 నవంబర్ ప్రజాపాలన: మాలల ఐక్యవేదిక వ్యవస్థాపకులు స్వర్గీయ ఆవుల బాలనాదం ప్రధమ వర్ధం

Published: Tuesday November 08, 2022
హైదరాబాదులోని  జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపకులు స్వర్గీయ ఆవుల బాలనాదం ప్రధమ వర్ధంతిని ఆది హిందూ భవన్ లో ఆదివారం నాడు జాతీయ మాలల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ ఆవుల బాలనాదం కు తమతో ఉన్న అనుబంధాన్ని సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుధీర్,మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శులు మన్నే శ్రీధర్ రావు బంగి ఆనంద్ రావు హైదరాబాద్ ప్రెసిడెంట్ బైండ్ల శ్రీనివాస్, డి సర్వయ్య  జీవి రత్నాకర్,  కరణం కిషన్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.