హైదరాబాద్ 6 నవంబర్ ప్రజాపాలన: మాలల ఐక్యవేదిక వ్యవస్థాపకులు స్వర్గీయ ఆవుల బాలనాదం ప్రధమ వర్ధం
Published: Tuesday November 08, 2022
హైదరాబాదులోని జాతీయ మాలల ఐక్యవేదిక వ్యవస్థాపకులు స్వర్గీయ ఆవుల బాలనాదం ప్రధమ వర్ధంతిని ఆది హిందూ భవన్ లో ఆదివారం నాడు జాతీయ మాలల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ ఆవుల బాలనాదం కు తమతో ఉన్న అనుబంధాన్ని సమాజానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుధీర్,మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శులు మన్నే శ్రీధర్ రావు బంగి ఆనంద్ రావు హైదరాబాద్ ప్రెసిడెంట్ బైండ్ల శ్రీనివాస్, డి సర్వయ్య జీవి రత్నాకర్, కరణం కిషన్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Share this on your social network: