కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు కి ఘనంగా నివాళులర్పించిన సిపిఐ

Published: Friday August 26, 2022
 పార్టీ మధిర ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో . గురువారం నాడుఆర్ టీ సీ ఎంప్లాయిస్ యూనియన్ కల్యాణ మండపం లో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా,రాష్ట్ర సహాయకార్యదర్శిగా పనిచేసిన సిద్ది వెంకటేశ్వర్లు  సంస్మరణ సభ ఊట్ల కొండలరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవి, మందడపు రాణి మాట్లాడుతూ కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు  1998 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా అనేకపోరాటలకు నాయకత్వం వహించారని అన్నారు. కామ్రేడ్ సిద్ది మరణం  కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మలిదశ తెలంగాణా ఉద్యమంలో కామ్రేడ్ సిద్ది నిర్వహించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లాసమితి సభ్యులు పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, మడుపల్లి లక్ష్మణ్, సిపిఐ మధిర పట్టణ సహాయకార్యదర్శి మంగళగిరి రామానుజం, మండల నాయకులుమచ్చావెంకటేశ్వరరావు,నాయకర్,  కొండాసాహెబ్,సుజాత పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.