విద్యార్థులకు ఐఐటీ పౌండేషన్ పుస్తకాల అందజేత. జన్నారం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన:
Published: Wednesday September 21, 2022
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల బోధనకై ఐఐటీ పౌండేషన్ ప్రాజెక్టర్ పుస్తకాలను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మార్కులనే ప్రమాణంగా తీసుకోకూడదని విద్యను అభ్యసించేందుకు ఎన్నో నూతన విధానాలు వస్తున్నాయని తెలిపారు .
మంచిర్యాల డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కలమడుగు వాస్తవ్యులు యాదగిరి శేఖర్ రావు ఉన్న ఊరు పై మమకారంతో తాను చదివిన పాఠశాలకు ప్రొజెక్టర్ ఐఐటి ఫౌండేషన్ పుస్తకాలను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావును డీఈవో వెంకటేశ్వర్లు శ్యామ్ నాయక్ లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, సర్పంచ్ కార్తిక రావు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి , ఆలయ కమిటీ చైర్మన్ స్వదేశ్ కుమార్, పాఠశాల హెచ్ఎం ప్రభాకర్, ఎన్ సి సి కట్టా రాజమౌళి, రాఘవేంద్ర లిటిల్ హాన్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఏఆర్ఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: