అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Friday February 25, 2022

బీరుపూర్, ఫిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలోని 5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి మున్నూరు కాపు సంఘ భవనంలో కాంక్రీట్ బెడ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం గ్రామానికి చెందిన కిరణ్ సీఎం సహయానిధి ద్వారా మంజూరైన 60 వేలు పర్శ కళావతికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన 1,00,116 రూపాయల చెక్కును వారి ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా ఎమ్మెల్యే అందజేశారు. గ్రామానికి చెందిన అల్లకొండ మురళి తల్లి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తుంగూర్ కోల్వాయి తాల్లధర్మారం కండ్లపల్లి తదితర గ్రామాలలో కళ్యాణలక్ష్మీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మ తహశీల్దార్ అరిఫోద్దీన్ స్థానిక సర్పంచులు గర్షకుర్తి శిల్పారమేష్ గుడిసె శ్రీమతి పర్వతం రమేష్ యేసు నల్ల మహిపాల్ రెడ్డి నారపాక రమరమేష్ ముప్పాల రాంచందర్ రావు చైర్మన్ నెరేళ్ల సుమన్ కొలుముల రమణ ముక్క శంకర్ వెంకటేష్ పూడూరి సుధాకర్ ఏఈ రాజమయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.