ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Published: Tuesday April 04, 2023
కోరుట్ల,ఏప్రిల్ 03 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  పలువురు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ పోరాట యోధుడని , ఓటమెరుగని దిరుడని, దేశంలో ఎన్నో ఆలయాలు నిర్మించి, హిందూ ధర్మాన్ని కాపాడిన హిందూ ధర్మ పరిరక్షకుడని  కొనియాడారు. ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య,
మాజీ సర్పంచ్ నరేష్, కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మహిపాల్ , ఎనుగందుల ప్రవీణ్, మెండే రాజేందర్, సహదేవ్, సట్ట రాజేష్, అశోక్, హరీష్, నిఖిల్, బలవంత రెడ్డి, పోతవేని రవి,గోపాల్ రెడ్డి, గణేష్, భుమరెడ్డి,
బుచ్చి రెడ్డి, రామ రెడ్డి,స్వామి రెడ్డి,కందుల రాజేష్,కంపెల్లి సంతోష్,కమలాకర్, సైదూ సురేష్  గ్రామ ప్రజలు ,యువత పాల్గొన్నారు