మృతుల కుటుంబాలకు ఎస్ కేఆర్ ట్రస్ట్ ఆర్ధిక సాయం

Published: Monday February 20, 2023
* ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 19 ఫిబ్రవరి ప్రజాపాలన : మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామంలో మంగలి యశోద శనివారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. అలాగే ఇదే గ్రామానికి చెందిన బైండ్ల నర్సింహులు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. అట్టి విషయం తెలుసుకుని ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి వారి ఇద్దరి అంత్యక్రియలకు 5 వేల  రూపాయల చొప్పున రూ.10 వేలు పంపించగా పీఏసీఎస్ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి గ్రామస్తులతో కలిసి మృతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రశేఖర్, ప్రవీణ్ రెడ్డి, మొగులయ్య, కిష్టయ్య, సంగయ్య, రాజు, బాగయ్య, సురేష్, అంజయ్య , సంగయ్య తదితరులు పాల్గొన్నారు.