అంబేద్కర్ విగ్రహానికి విరాళం అందించిన జర్నలిస్ట్

Published: Tuesday November 16, 2021
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 15, ప్రజాపాలన : జిల్లా లోని దండెపెల్లి మండలం తాళ్ళపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహానికి తన వంతు సాయం గా అదే గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయు లు ముస్తఫా పదివేల పదహారు రూపాయలు సోమవారం విరాళం గా అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అంబెడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లనే నేడు ప్రజాస్వామ్య బారతదేశంలో హక్కులు పొందుతు న్నామని అన్నారు. ప్రతి గ్రామంలో అంబెడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసు కోవాలని తద్వారా బావితరాలు అంబెడ్కర్ స్పూర్తితో ముందుకు వెళ్ళుతారని పేర్కొన్నారు. హక్కులు పోందాలంటే రాజ్యాంగం పై అవగాహన ఉండాలని ఇది చదువు తోనే సాద్యం అవుతుందని అన్నారు. ప్రతిఒక్కరు చదువుకోవడం వలన మెరుగైన సమాజం ఏర్పాడుతుందని, దాంతోపాటు బావితరాలు విజ్ఞానంతో కూడిన అదునాతన సమాజాన్ని నిర్మించుకుం టారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు రాజన్న, ప్రశంత్,  మహెందర్, ప్రెమ్ కూమర్, వినయ్ అంజిలు పాల్గొన్నారు.