ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ఎన్నారై ప్రతినిధి శ్రీ తాళ్లూరి జయ శేఖర్ కి ఘ

Published: Saturday December 03, 2022

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని  మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి  దంపతులను శుక్రవారం నాడు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ఎన్నారై ప్రతినిధి శ్రీ తాళ్లూరి జయ శేఖర్  వారి స్వగృహానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక సమావేశం అయ్యారు, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమానికి మండలంలోని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సహాయ సహకారాలు అందించాలని వారిని పలువురు ప్రజా ప్రతినిధులు సూచించారు, అభివృద్ధిలో తను ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటానని తన సహాయ సహకారాలు ఉంటాయని తను కూడా భాగస్వామి అవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల బిఆర్ఎస్  పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, పార్టీ నాయకులు పోతిరెడ్డి గోవింద్ రెడ్డి, బిట్రా సాయిబాబు, చుక్క బాలాజీ, లక్ష్మీపురం వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి, తాళ్లూరి శ్రీహరిబాబు, తదితరులు పాల్గొన్నారు.