జిల్లా జర్నలిస్ట్ సంఘం నాయకులను సన్మానించిన విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు విశ్వబ్రాహ్మణ

Published: Saturday June 18, 2022

మెట్ పల్లి, జూన్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘం ఉపాధ్యక్షలుగా కోటగిరి దశరథం మరియు జిల్లా కార్యవర్గ సభ్యులుగా నాంపల్లి నమ్లాద్రి గార్లు గెలుపొందిన సందర్బంగా, మెట్ పల్లి స్వర్ణకార సంఘ భవనం లో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు మరియు విశ్వ బ్రాహ్మణ పాత్రికేయులు వీరిని ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో స్వర్ణకార నాయకులు నాంపెల్లి సింహాద్రి, శ్రీరామోజు ప్రవీణ్, లక్ష్మణ్, మురళి, శ్రీపాద సతీష్, హరీష్, కృష్ణమాచారి పాత్రికేయులు రఘునాథ్, నవీన్, గాలిపెల్లి నాగరాజు, అశోక్, రత్నాకర్, బెజ్జరపు నాగరాజు తదితరులు ఉన్నారు.

 
 
 
Attachments area