హెల్పింగ్ హాండ్స్ ద్వారా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

Published: Wednesday September 15, 2021
మధిర, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మధిర హెల్పింగ్ హాండ్స్ నిర్వాహకులు మధిర డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ అత్తలూరి మధులిక, ఖమ్మంపాడు సొసైటీ సీఈఓ దొండపాటి వీరభద్రం ఆధ్వర్యంలో ఈరోజు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ నాగార్జున రావు ఉపాధ్యాయులు రఫీ, సంధ్య లక్ష్మి మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు