బిజెపి అభ్యర్థిని గెలిపించండి

Published: Monday March 01, 2021
మధిర, ఫిబ్రవరి 28, ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండల కేంద్రంలో మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో శాసనమండలి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగ, ఉద్యోగులకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షులు ముక్కపాటి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకు అయినా ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ద్వారా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు కావేటి ధనలక్ష్మి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి  పుప్పాల చంద్రమౌళీశ్వర రావు. బిజెపి నాయకులు నూతక్కి నరసింహారావు, మిరియాల నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, రామకృష్ణ గౌడ్, ధని శెట్టి వెంకటేశ్వరరావు, వేమా ఏడుకొండలు, టౌన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు