ఆనందయ్యకు సన్మానం
Published: Monday August 09, 2021
మధిర, ఆగస్టు 08, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి బారినపడిన ఎంతో మంది ప్రాణాలను కాపాడి, కరోనా రాని వారికి కరోనా రాకుండా ఉచితముగా మందును పంపిణీ చేస్తూ, ఎంతో మంది హృదయాలలో ప్రాణదాతగా పేరొందిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి, యాదవరత్న అవార్డు గ్రహీత శ్రీ బొనిగ ఆనందయ్య యాదవ్ గారిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ క్లబ్ లోని కలసి ఘనంగా సన్మానించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు వీర్ల వర ప్రసాద్, ప్రముఖ న్యాయవాది మరియు నాగవరప్పాడు మాజీ సర్పంచ్ చావలి రామరాజు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి కార్పొరేటర్ శ్రీ మతి బొంతు శ్రీదేవి యాదవ్, రాష్ట్ర నాయకులు యల్లావుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: