పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా ఆవిష్కరణ

Published: Thursday April 28, 2022

రాయికల్, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత రాష్ట్ర  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మైతాపూర్ గ్రామంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తెరాస పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్ నాయకులు పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.