పంది దాడిలో ఇరువురు మహిళలకు తీవ్ర గాయాలు పందుల స్వైరవిహారం తో విచక్షణారహితంగా దాడి తీవ్ర గా
Published: Saturday August 06, 2022
పాలేరు ఆగస్ట్ 5 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
మండలం లోని చెరువుమాధారం గ్రామంలో పందుల స్వైర విహరం తో ఇరువురు కు తీవ్ర గాయాలైయ్యాయి. విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచాయి. బాధితుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని చెరువుమాధారం గ్రామానికి చెందిన నందిగామ వెంకమ్మ, ఇస్సంపల్లి మరియమ్మ లు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్తుండుగా ఒక్కసారిగా పంది వచ్చి దాడి చేసింది. ఇరువురు ను విచక్షణరహితంగా దాడి చేయటం తో తీవ్ర గాయాలైయ్యాయి. ఆరుపులు, కేకలతో చుట్టుపక్కల వారు ఘటన స్థలం కు చేరుకుని పంది నుంచి ఇరువురు ను కాపాడారు. లేని పక్షంలో పరిస్థితి దారుణంగా ఉండేదని బాధితులు వాపోయారు. ఇరువురు ను ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందించారు. పందులు ఇళ్ల మధ్యలో ఉండటం వలన ప్రజలపై దాడులు
1511
Share this on your social network: